లాక్ డౌన్ సడలింపులు.. కోల్ కతాలో తిరిగి అందుబాటులోకి రానున్న ఎల్లో ట్యాక్సీలు!
- మీటరుపై ప్రస్తుతం ఉన్న ఛార్జీల కంటే 30 శాతం పెంపు
- ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి
- కారు వెనుక సీట్లో ప్రయాణికులు కూర్చోవాలని నిబంధన
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ సీనియర్ అధికారులు నిన్న సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. ఈ సమావేశంలో ఈ మేరకు అధికారులు ప్రతిపాదించారని అన్నారు. ఈ నెల 18 నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఎల్లో టాక్సీల్లో ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గరిష్టంగా ఇద్దరు ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఇద్దరు ప్రయాణికులు వెనుక సీట్లో కూర్చోవాల్సి ఉంటుందని వివరించారు.