తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి.. డెడ్ బాడీలకు కూడా కరోనా టెస్టులు చేయాలని ఆదేశం!
- మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదని ప్రభుత్వ ఉత్తర్వులు
- హైకోర్టులో పిటిషన్ వేసిన ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు
- పరీక్షలు చేయకపోతే మూడో స్టేజికి చేరుకుంటామని ఆందోళన
ఈ సందర్భంగా ఏపీలో చోటుచేసుకున్న ఘటనలను లాయర్ ప్రభాకర్ ఉటంకించారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో చనిపోయిన తర్వాత డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తే కరోనా బయటపడిందని చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలను హైకోర్టుకు అందించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రూల్స్ పాటిస్తోందో నివేదిక అందించాలని ఆదేశించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వివిధ సంస్థలు ఇచ్చిన సూచనలను పాటించాలని చెప్పింది. ఈ నెల 26న నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 26కు వాయిదా వేసింది.