AP DGP: ముఖ్యమైన పనులపై ప్రయాణించే వారికి ఈ-పాస్‌లు: ఏపీ డీజీపీ కార్యాలయం

AP DGP Office ready to issue Epasses
  • అత్యవసర పనులపై బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు
  • సీఎం ఆదేశాల మేరకు ఈ-పాస్‌లు జారీచేయనున్న పోలీసులు
  • దరఖాస్తును ఆమోదిస్తే మొబైల్ నంబరుకు ఈ-పాస్

అత్యవసర వైద్య చికిత్స, కుటుంబంలో మరణం, సామాజిక పనులు, ప్రభుత్వ విధి నిర్వహణ తదితర అత్యవసర పనులపై ప్రయాణించాలనుకునే వారికి ఈ-పాస్‌లు జారీ చేయనున్నట్టు ఏపీ పోలీస్ శాఖ తెలిపింది. అవసరమైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది. పై కారణాలతో ప్రయాణించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ-పాస్‌లు జారీ చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది.

ఈ-పాస్‌ల కోసం https:citizen.appolice.gov.in  అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం సమర్పించిన వివరాలను పోలీసులు ఆమోదిస్తే దరఖాస్తు చేసుకున్న వారి మొబైల్, మెయిల్ ఐడీకి వాహన అత్యవసర పాస్‌ను పంపిస్తారు.

  • Loading...

More Telugu News