Venkaiah Naidu: ప్రధాని ప్రకటించిన ఆర్థిక ప్యాకేజ్ ను స్వాగతించిన ఉపరాష్ట్రపతి

Vice president Venkaiah Naidu welcomes package
  • ‘కరోనా’ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ ప్యాకేజ్ దోహదపడుతుంది
  •  దేశ ఆర్థికస్వావలంబనకు ఈ ప్యాకేజ్ ఊతమిస్తుంది
  •  స్థానిక పరిశ్రమలకు చేయూత నివ్వాలన్న ఉప రాష్ట్రపతి 

‘కరోనా’, లాక్ డౌన్ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాలను ఆదుకోవాలన్న తలంపుతో రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజ్ ను ప్రధాని నరేంద్రమోదీ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్యాకేజీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వాగతించారు. ‘కరోనా’ సవాళ్లను ఎదుర్కొనేందుకు, దేశ ఆర్థిక స్వావలంబనకు ఈ ప్యాకేజ్ ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, వివిధ వర్గాలకు ఈ ప్యాకేజ్ ద్వారా మేలు జరుగుతుందని భావించారు. ఆత్మనిర్భర భారత్ స్వప్న సాధనకు సంస్కరణలు చేపట్టాల్సిన తరుణం ఇదేననని అన్నారు. స్థానిక పరిశ్రమలకు చేయూత నివ్వాలని, తద్వారా భారత్ అంతర్జాతీయంగా పోటీ పడేలా ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.

  • Loading...

More Telugu News