మండే ఎండలో వలస కూలీల నరకయాతన.. ట్రక్కులో హైదరాబాద్ నుంచి చత్తీస్గఢ్కు పయనం!
- ట్రక్కులో బయలుదేరిన దాదాపు 20 మంది కూలీలు
- ఎండకు అలమటించి పోయిన మహిళలు, చిన్నారులు
- తినడానికి తిండిలేక, తాగేందుకు నీళ్లు లేక అవస్థలు
దాదాపు 20 మంది వరకు ఉన్న ఈ బృందంలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. పై నుంచి ఎండ సర్రున కాలుస్తుంటే మరో మార్గం లేని వారంతా బాధను అదిమిపెట్టుకుని కూర్చున్నారు. ఆకలి, ఎండవేడిమికి తాళలేక చిన్నారులు అలమటించిపోయారు. తినడానికి తిండిలేక, తాగేందుకు నీళ్లు లేక అవస్థలు పడ్డారు. వీరిని చూసిన కొందరి మనసులు తర్కుకుపోయాయి. మరికొన్ని గంటల్లో స్వస్థలాలకు చేరుకుంటామన్న ఆనందం వారిని బాధను భరించేలా చేసింది.