మద్యం షాపులు తెరిచి ఇన్నాళ్ల శ్రమ వృథా చేశారు: భట్టి విక్రమార్క
- పోలీసు కాపలా మధ్య విక్రయిస్తున్నారంటూ విమర్శలు
- పేద ప్రజలు మరణిస్తున్నారని ఆవేదన
- అయినా మద్యంతో వచ్చే ఆదాయమే ముఖ్యమా? అంటూ ఆగ్రహం
కొత్త విద్యుత్ చట్టం విధివిధానాలు వెల్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త విద్యుత్ చట్టంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా నష్టమో చెప్పాలని అన్నారు. ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీ సబ్సిడీలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. సబ్సిడీలు చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని అన్నారు. కేంద్రం ఎందుకు చట్టం తెస్తుందో, కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియదంటూ భట్టి వ్యాఖ్యానించారు. అసలు, కేంద్రంతో కేసీఆర్ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదని పేర్కొన్నారు. ప్రజలకు నష్టం జరుగుతుందని భావిస్తే కాంగ్రెస్ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు.