Telangana: తెలంగాణలో పెరుగుతున్న కేసులు... ఇవాళ 31 మందికి కరోనా పాజిటివ్

  • జీహెచ్ఎంసీ పరిధిలో 30 మందికి కరోనా
  • ఇవాళ 24 మంది డిశ్చార్జి
  • మొత్తం కేసుల సంఖ్య 1163
Thirty one more cases registered today in Telangana

తెలంగాణలో కరోనా వ్యాప్తిని పరిశీలిస్తే కొన్నిరోజులుగా తగ్గుముఖం పడుతున్నట్టుగా కనిపించింది. అయితే ఇవాళ ఒక్కరోజే 31 కొత్త కేసులు బయటపడ్డాయి. వాటిలో 30 జీహెచ్ఎంసీ పరిధిలోనే గుర్తించారు. మరో కేసులో వలస కార్మికుడికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఓవరాల్ గా తెలంగాణలో ఇప్పటివరకు 1163 కేసులు నమోదయ్యాయి. ఇవాళ 24 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 751కి చేరింది. ప్రస్తుతం 382 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, 30 మంది మరణించారు.

More Telugu News