Mumbai: ముంబై ఆసుపత్రిలో దారుణం.. కరోనా పేషెంట్ల పక్కనే శవాలు!

  • సియాన్ ఆసుపత్రిలో కరోనా పేషెంట్ల పక్కనే ఏడు శవాలు
  • వీడియో పోస్ట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే
  • శవాల పక్కనే పేషెంట్లు నిద్రపోతున్నారని ట్వీట్

కరోనా పేషెంట్ల పక్కనే శవాలను ఉంచిన వీడియో జనాలను షాక్ కు గురి చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ముంబైలోని సియాన్ ఆసుపత్రిలో తీసింది. ఆసుపత్రిలోని ఓ వార్డులో కరోనా పేషెంట్ల పక్కనే శవాలు ఉన్న బ్యాగులను పడేశారు. సియాన్ ఆసుపత్రిని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ముంబైలో కరోనా కేసులను హ్యాండిల్ చేయడంలో ఈ ఆసుపత్రి ప్రధాన పాత్రను పోషిస్తోంది.

ట్రీట్మెంట్ తీసుకుంటున్న కరోనా పేషెంట్ల పక్కన కనీసం ఏడు మృతదేహాలు వీడియోలో కనిపిస్తున్నాయి. పేషెంట్లను చూసేందుకు వారి బంధువులు వస్తున్న సన్నివేశాలు కూడా వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోను మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే ట్విట్టర్ లో షేర్ చేశారు. 'సియాన్ ఆసుపత్రిలో మృతదేహాల పక్కనే కరోనా పేషెంట్లు నిద్రపోతున్నారు. ఇదెక్కడి అడ్మినిస్ట్రేషన్? సిగ్గుపడాల్సిన విషయం' అని ఆయన కామెంట్ చేశారు.

More Telugu News