ముంబై ఆసుపత్రిలో దారుణం.. కరోనా పేషెంట్ల పక్కనే శవాలు!
- సియాన్ ఆసుపత్రిలో కరోనా పేషెంట్ల పక్కనే ఏడు శవాలు
- వీడియో పోస్ట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే
- శవాల పక్కనే పేషెంట్లు నిద్రపోతున్నారని ట్వీట్
ట్రీట్మెంట్ తీసుకుంటున్న కరోనా పేషెంట్ల పక్కన కనీసం ఏడు మృతదేహాలు వీడియోలో కనిపిస్తున్నాయి. పేషెంట్లను చూసేందుకు వారి బంధువులు వస్తున్న సన్నివేశాలు కూడా వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోను మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే ట్విట్టర్ లో షేర్ చేశారు. 'సియాన్ ఆసుపత్రిలో మృతదేహాల పక్కనే కరోనా పేషెంట్లు నిద్రపోతున్నారు. ఇదెక్కడి అడ్మినిస్ట్రేషన్? సిగ్గుపడాల్సిన విషయం' అని ఆయన కామెంట్ చేశారు.