Jagan: మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా చూస్తాం: జగన్

Jagan assures job from LG for deceased family in gas leak incident
  • గ్యాస్ లీకేజీ ఘటన బాధాకరం
  • అపస్మారక స్థితిలో ఉన్నవారు కోలుకుంటున్నారు
  • ప్రమాదంపై విచారణకు ఆదేశించాం

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అస్వస్థతకు గురైన వారు, అపస్మారక స్థితిలో ఉన్నవారు కోలుకుంటున్నారని చెప్పారు. మల్టీ నేషనల్ కంపెనీలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను ఆదేశించామని చెప్పారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు.

ప్రమాదంపై అధ్యయనం చేసేందుకు కమిటీని కూడా వేశామని... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏం చేయాలనే దానిపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని జగన్ చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు అలారం మోగాలని, కానీ అలా జరగలేదని తెలిపారు. ఘటనలో మృతి చెందిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా చూస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News