Allu Arjun: 'ఆర్య' కథతో ముందుగా ప్రభాస్ దగ్గరికి వెళ్లిన సుకుమార్

  • బన్నీకి హిట్ ఇచ్చిన 'ఆర్య'
  • ఆసక్తిని చూపని రవితేజ, నితిన్
  • 4 కోట్లతో నిర్మాణం .. 25 కోట్ల వసూళ్లు    
Arya Movie

అల్లు అర్జున్ కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచిన చిత్రాల్లో 'ఆర్య' ఒకటి. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అల్లు అర్జున్ ను హీరోగా మరో మెట్టు పైకి ఎక్కించింది. కథను పూర్తి చేసిన సుకుమార్, 'దిల్' రాజును కలవగా ఆయన ఈ  సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చాడట. దాంతో ఈ కథను పట్టుకుని సుకుమార్ చాలామంది కథానాయకులను కలిశాడట.

ముందుగా ఆయన ఈ కథను పట్టుకుని ప్రభాస్ ను కలిశాడట. అతనికి కథ చెప్పిన తర్వాత, ఎక్కడైనా మార్పులు చేర్పులు వుంటే చెప్పమని, వాటిని సరిచేస్తానని సుకుమార్ చెప్పాడట. అయినా ప్రభాస్ ఎందుకో ఈ కథ పట్ల అంతగా ఆసక్తిని చూపలేదట. దాంతో రవితేజ .. నితిన్ లకు కూడా సుకుమార్ ఈ కథను వినిపించాడట. వాళ్లు కూడా అంతగా ఆసక్తిని కనబరచకపోవడంతో, అల్లు అర్జున్ ను కలిసి కథ చెప్పడం జరిగిందట.   ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్య' యూత్ కి ఒక రేంజ్ లో  కనెక్ట్  అయింది.  4 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, 25 కోట్లను రాబట్టి భారీ విజయాన్ని నమోదు చేసింది. అలా ఒక సంచలన విజయం అల్లు అర్జున్ ను వెతుక్కుంటూ వెళ్లిందన్న మాట.

  • Loading...

More Telugu News