GVMC: విశాఖలో 1500 ఇళ్లను ఖాళీ చేయించాం: జీవీఎంసీ కమిషనర్ సృజన

  • ఖాళీ చేయించిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం
  • 180 మంది బాధితులకు కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నాం
  • మరో 40 మందిని అపోలో ఆసుపత్రికి తరలించాం
Gas Leakage incident in Vizag

విశాఖ లో గ్యాస్ లీకేజ్ ఘటన నేపథ్యంలో దాదాపు 1500 ఇళ్లల్లోని వారిని ఖాళీ చేయించామని జీవీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. ఖాళీ చేయించిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి 180 మంది బాధితులు కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారని, మరో 40 మందిని అపోలో ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ముగ్గురు బాధితులకు వెంటిలేటర్లపై చికిత్స అందిస్తున్నామని అన్నారు. కాగా, ఈ ఘటనలో బాధితులను పరామర్శించే నిమిత్తం వైజాగ్ కు సీఎం జగన్ బయలుదేరారు.

  • Loading...

More Telugu News