Mahesh Babu: మే 31న మహేశ్ కొత్త ప్రాజెక్టులు ప్రకటించే అవకాశం!

  • ఈ నెల 31న కృష్ణ పుట్టినరోజు
  • పరశురామ్ మూవీ నుంచి ఫస్టులుక్
  • లైన్లో ఇద్దరు దర్శకులు  
Parashuram Movie

ఈ నెల 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. మహేశ్ బాబు తాజా చిత్రం నుంచి టైటిల్ తో కూడిన ఫస్టు పోస్టర్ ను ఆ రోజున రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  మహేశ్ బాబు తన తదుపరి సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా నుంచి మహేశ్ బాబు ఫస్టులుక్ ను వదలాలనే ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మరో రెండు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఆ రోజున వెలువడనున్నట్టు చెబుతున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు అన్ని రకాల పనులను పూర్తి చేసుకుని సెట్స్ పైకి  వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. ఈ లోగా మహేశ్ బాబు రెండు సినిమాలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ రెండు సినిమాలకి సంబంధించిన ప్రకటన మే 31వ తేదీన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.  ఆ ఇద్దరు దర్శకులు ఎవరు? కథా నేపథ్యం ఏమిటి? మహేశ్ బాబు పాత్ర ఎలా వుండనుంది? అనేది ఆసక్తికరంగా మారింది.  దాంతో కృష్ణ పుట్టినరోజు కోసం అభిమానులంతా కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.

More Telugu News