KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలివి!

  • కరీంనగర్ దేశానికే రోల్ మోడల్ 
  • నా ప్రాణం ఉన్నంత వరకూ రైతు బంధు ఆగదు
  • కొత్త కరోనా కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే
  • ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్న కేసీఆర్
KCR Press Meet Highlights

తెలంగాణలో విధించిన లాక్ డౌన్ 7వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, తదుపరి తీసుకోవాల్సిన చర్యలు, కేంద్రం ఇచ్చిన లాక్ డౌన్ సడలింపులపై సహచర మంత్రులతో చర్చించిన కేసీఆర్, ఆపై నిన్న రాత్రి, సుమారు గంటన్నర పాటు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రెస్ మీట్ లోని ముఖ్యాంశాలు...

* రాష్ట్రంలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగింపు
* లాక్ డౌన్ కు ప్రజలందరూ సహకరించాలి
* రాష్ట్రంలో 1096 కు చేరిన కరోనా బాధితులు
* మంగళవారం కొత్తగా 11 మందికి పాజిటివ్.. 43 మంది డిశ్చార్జ్
* రాష్ట్రంలో 439 యాక్టివ్ కేసుల నమోదు
* ఈ రోజు నుంచి రాష్ట్రంలో మద్యం షాపులు ఓపెన్
* రెడ్ జోన్ లోను మద్యం షాపులు ఓపెన్
* ప్రజలు సహకరించకపోతే మద్యం షాపులను వెంటనే క్లోజ్ చేస్తాం
* అవసరం మేరకే కరోనా టెస్టులు చేస్తాము
* కరీంనగర్ నుంచి దేశానికే రోల్ మోడల్ అయినం
* సింగిల్ డెత్ లేకుండా కరీంనగర్ ను కాపాడుకున్నం
* ఆగస్టు, సెప్టెంబర్ లో రాష్ట్రం నుంచే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది
* రాష్ట్రంలో 6 జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయి... 18 జిల్లాలు ఆరెంజ్ జోన్ లో  ఉన్నాయి.
 9 జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి.
* కొత్త కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే వస్తున్నాయి
* కేంద్ర సడలింపులు పాటించాల్సిందే
* రెడ్ జోన్లలో 66% పాజిటివ్ కేసులు ఉన్నాయి
* రాత్రిపూట కఠినమైన కర్ఫ్యూ కొనసాగుతుంది
* రాష్ట్రంలో సరిపడా మాస్కులు, పీపీఈ కిట్లు తక్కువగా ఉన్నాయి
* కొన్ని రోజులు ఓపిక పడితే మంచి ఫలితాలు
* ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నాము
* రెడ్ జోన్ లలో ఎట్టి పరిస్థితుల్లో షాపులు తెరవడానికి వీలులేదు
* 10 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చాము
* 27 జిల్లాల్లో అన్ని సడలింపులు
* వ్యవసాయరంగ పనులు కొనసాగుతాయి
* నిర్మాణ వ్యవసాయ సంబంధిత షాపులు తీయడానికి ఓకే
* 6 రెడ్ జోన్ జిల్లాలలో ఎటువంటి సడలింపులు ఉండవు
* 15వ తేదీన సమీక్ష నిర్వహించి సడలింపులపై చర్చిస్తాం
* అన్ని ఆర్టీఏ ఆఫీసులలో రేపటి నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి
* తెలంగాణ కన్నా చిన్న దేశాలు వందకు పైగా ఉన్నాయి
* కోర్టు నిబంధనల ప్రకారం పదవతరగతి పరీక్షలు
* తక్కువ మంది విద్యార్థులతో పరీక్ష కేంద్రాలు
* మే నెలలో టెన్త్ ఎగ్జామ్స్ పూర్తి చేస్తాం
* భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరుపుకోవచ్చు
* ఇంటర్ పేపర్ వాల్యూవేషన్ తక్షణం ప్రారంభం అవుతుంది
* కరోనా, మనం కలిసి బతకాల్సిందే
* గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మండల కేంద్రాలు, గ్రామాల్లో సడలింపులు
* యువ న్యాయవాదులకు సాయం చేసేందుకు రూ.25 కోట్లు
* తక్షణమే లాయర్లకు కు రూ.15 కోట్లు రిలీజ్
* ఏడున్నర లక్షల మంది కార్మికులకు వసతులు కల్పించాo
* వలస కూలీలు ఉంటే వారికి అన్ని వసతులను సమకూర్చుతాం
* వలస కూలీలు తమ రాష్ట్రాలకు వెళ్తామంటే పంపిస్తాం
* ఏ రాష్ట్రంలోనూ 100 శాతం పంటలు కొనడం లేదు
* తెలంగాణలో మాత్రమే పంటలు కొంటున్నాం
* 7 వేలకుపైగా సెంటర్లలో ధాన్యం కొంటున్నం
* ఈ విషయాన్ని విపక్షాలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నాయి
* తెలంగాణ లో ఉండేది రైతు రాజ్యం, చిల్లర రాజకీయం కాదు
* రైతులకు ఉచిత కరెంటు ఇచ్చే రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రమే
* వర్షాకాలంలో  రైతుబంధు పథకం కింద రైతులకు 7 వేలు ఇస్తాం
* పేదలకు పెన్షన్లు కొనసాగుతాయి
* నేను బతికి ఉన్నంత వరకూ రైతుబందు కొనసాగుతుంది
* రుణమాఫీ కోసం బుధవారం రూ. 1200 కోట్లు రిలీజ్ చేస్తాం
* రూ 25 వేల లోపు రుణం ఉన్నవారికి  మాఫీ చేస్తాం

More Telugu News