వలస కూలీల కోసం నేటి నుంచి రోజుకు 40 రైళ్లు: కేసీఆర్
- తెలంగాణలో చిక్కుకుపోయిన వివిధ రాష్ట్రాల కూలీలు
- ఒక్కో రైలులో 1200 చొప్పున రోజుకు 48 వేల మంది
- పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు
స్వస్థలాలకు వెళ్లేందుకు వివిధ పోలీస్ స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకున్న కార్మికులను ఈ రైళ్ల ద్వారా తరలించనున్నారు. కార్మికులను వారి ప్రాంతాలకు తరలించేందుకు చేస్తున్న ఏర్పాట్ల గురించి వారికి వివరించాల్సిందిగా పోలీసులను కేసీఆర్ కోరారు. ఒక్కో రైలులో 1,200 మంది చొప్పున 48 వేల మందిని తరలించే అవకాశం ఉందని అంచనా. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సుల్తానియా, జితేందర్రెడ్డిలను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది.