Telangana: ఇవాళ తెలంగాణలో కొత్త కేసుల సంఖ్య... మూడు!

  • తెలంగాణలో తగ్గుతున్న కరోనా తీవ్రత
  • మొత్తం కేసుల సంఖ్య 1085
  • ఇవాళ 40 మంది డిశ్చార్జి
Today only three corona cases registered in Telangana

తెలంగాణలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. ఇవాళ రాష్ట్రంలో కేవలం 3 కొత్త కేసులే నమోదయ్యాయి. ఆ మూడు కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనివే. దాంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1085కి పెరిగింది. నేడు 40 మంది డిశ్చార్జి అయ్యారు. ఇక, తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 29 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 471 మంది చికిత్స పొందుతుండగా, 585 మంది కోలుకున్నారు.
.

More Telugu News