Andhra Pradesh: ఏపీలో తొలిరోజు మద్యం విక్రయాల అంచనా రూ.40 కోట్లు!

  • ఇవాళ రాత్రి ఏడు గంటలతో ముగిసిన మద్యం విక్రయాలు
  • ప్రకాశం  మినహా రాష్ట్ర వ్యాప్తంగా తెరచుకున్న దుకాణాలు
  • 2,345 మద్యం దుకాణాల ద్వారా మద్యం విక్రయం
First day Alcohol sales Estimation in AP is fourty crores

ఏపీలో తొలిరోజు మద్యం విక్రయాలు ఇవాళ రాత్రి ఏడు గంటలతో ముగిశాయి. తొలిరోజు   రూ.40 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు అంచనా. ఏపీలో అధికారికంగా మొత్తం 3,468 దుకాణాలు ఉన్నాయి. ఈ రోజు 2,345 మద్యం దుకాణాలను తెరిచారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో మాత్రం మద్యం దుకాణాలు తెరవలేదు.

కాగా, ఈ రోజు ఉదయం 11 గంటలకు మద్యం షాపులు తెరిచి రాత్రి  7 గంటల వరకు విక్రయాలు కొనసాగించారు. మద్యం కోసం మందుబాబులు బారులు తీరారు. ఏపీ, తమిళనాడు సరిహద్దు గ్రామాల్లోని మద్యం దుకాణాల వద్దకు తమిళనాడు వాసులు రావడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో ఈ పరిస్థితులు నెలకొనడంతో ఆయా దుకాణాల్లో మద్యం విక్రయాలను అధికారులు నిలిపివేశారు.

More Telugu News