వ్యవసాయ రంగం, ఎగుమతులపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం: మోదీ
- వ్యవసాయరంగంపై ప్రధాని సమావేశం
- అగ్రికల్చర్ మార్కెటింగ్ పై చర్చించామన్న మోదీ
- బ్రాండ్ ఇండియా కోసం కృషి చేస్తున్నామని వెల్లడి
కిసాన్ క్రెడిట్ కార్డులు, పీఎం కిసాన్, ఈ-నామ్ వంటి పథకాలు రైతులకు మరింత ఉపయోగపడేందుకు అవసరమైన చర్యలపైనా అభిప్రాయాలు స్వీకరించామని ట్విట్టర్ లో వెల్లడించారు. ఫల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన ఆర్డర్ల పెంపుదలపైనా ప్రభుత్వం కృషి చేస్తోందని, వ్యవసాయ ఎగుమతులకు మరింత ఊతమిచ్చేలా సదరు రంగంలో 'బ్రాండ్ ఇండియా' కోసం పరిశ్రమిస్తున్నామని తెలిపారు.