సిమెంట్ మిక్సర్ లో 18 మంది వలస కార్మికులు... దిగ్భ్రాంతికి గురైన పోలీసులు
- లాక్ డౌన్ తో దిక్కుతోచని స్థితిలో వలస కార్మికులు
- స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు
- మిక్సర్ వాహనంలో వెళ్లేందుకు ప్రయత్నించి దొరికిపోయిన వైనం
ఉత్తరప్రదేశ్ లోని లక్నో వెళుతుండగా ఇండోర్, ఉజ్జయిన్ జిల్లాల మధ్య వారిని అడ్డుకున్నారు. వాహనం ఎక్కడికి వెళుతోందని పోలీసులు ప్రశ్నించగా, డ్రైవర్ నీళ్లు నమిలాడు. దాంతో అనుమానం వచ్చి సోదా చేయగా, మిక్సర్ ట్యాంకులో వలస కార్మికులు కనిపించారు. ట్రక్ డ్రైవర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, కార్మికులను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం స్వస్థలం వెళ్లేందుకు బస్సు ఏర్పాటు చేయనున్నారు.