మద్యం షాపులు తెరవాలంటూ 'లాజిక్' చెబుతున్న రాజస్థాన్ ఎమ్మెల్యే!
- రాజస్థాన్ సీఎంకు కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ
- ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవచ్చు
- వెంటనే షాపులు తెరిపించాలని వినతి
ఆల్కహాల్ తో చేతులను శుభ్రం చేసుకుంటే, చేతిపై ఉన్న కరోనా క్రిములు చనిపోతాయని గుర్తు చేసిన ఆయన, గొంతులో తిష్టవేసి ఉండే కరోనా క్రిములను హతమార్చేందుకు మద్యాన్ని వాడొచ్చు కదా? అని ఆయన అభిప్రాయపడ్డారు. మద్యం షాపుల మూసివేతతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని తెలిపారు. మార్కెట్లో మద్యానికి డిమాండ్ అధికంగా ఉందని, షాపులను తెరిపిస్తే, లాక్ డౌన్ సమయంలో నష్టపోయిన ప్రభుత్వ ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు కూడా వీలుంటుందని ఆయన తెలిపారు. ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోదు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని భరత్ సింగ్ కోరారు.