Police: ఆరుగురు కుటుంబీకులను హత్య చేసి... తాపీగా వెళ్లి పోలీసులకు లొంగిపోయిన లక్నో యువకుడు!

  • ఆస్తి విషయంలో వివాదం
  • తల్లిదండ్రులు సహా ఆరుగురి హత్య
  • కేసును విచారిస్తున్న పోలీసులు
Man Murdered six of his Family Members in Lucknow

ఆస్తి వివాదాల నేపథ్యంలో ఆరుగురు కుటుంబీకులను దారుణంగా హత్య చేసిన ఓ వ్యక్తి, తాపీగా పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, నగర శివార్లలో అజయ్ సింగ్ (26) నివాసం ఉంటున్నాడు. వారి కుటుంబంలో ఓ ఆస్తికి సంబంధించిన వివాదం చాలా కాలంగా సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఇంట్లోని వారితో గొడవ పడిన అజయ్ సింగ్, ఓ పదునైన ఆయుధంతో వారిపై దాడికి పాల్పడ్డాడు. తన తల్లిదండ్రులు అమర్ (60), రామ్ శక్తి (55), పెద్దన్న అరుణ్ (40), వదిన రామ్ దులారీ (35), వారి పిల్లలు సౌరభ్ (7), సారిక (2)లను హతమార్చాడు. ఆపై తానే ఈ హత్యలు చేశానంటూ పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోయాడని లక్నో కమిషనర్ సుజీత్ పాండే వెల్లడించారు. ఈ విషయంలో కేసును రిజిస్టర్ చేశామని, విచారణ జరుపుతున్నామని తెలిపారు.

More Telugu News