పెరూ జైలులో 600 మందికి కరోనా.. ఖైదీల బీభత్సం.. 9 మంది మృతి
- కరోనా భయంతో విడుదల చేయాలంటూ ఖైదీల ఆందోళన
- గోడలు ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నం
- 70 మందికి గాయాలు
ఈ సందర్భంగా హింసాత్మక ఘటనలకు పూనుకున్నారు. చాలామంది ఖైదీలు జైలు గోడలు ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించగా, మరికొందరు జైలు సిబ్బందిపై దాడికి యత్నించారు. మంచాలు తగలబెట్టారు. ఈ సందర్భంగా వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన 60 మంది జైలు సిబ్బంది, ఐదుగురు పోలీసులు, ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, దేశంలో ఇప్పటి వరకు 31 వేల మంది కరోనా బారినపడగా, 800 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.