కనగరాజ్ ప్రమాణస్వీకారం వల్లే రాజ్ భవన్ కు కరోనా సోకిందనడం దారుణం: మంత్రి మోపిదేవి
- కరోనా దెబ్బకు అమెరికానే వణికింది
- పక్క రాష్ట్రంలో ఉండి చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు
- కరోనా కిట్లపై విచారణ అవసరం లేదు
రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ ప్రమాణస్వీకారం చేయబట్టే రాజ్ భవన్ కు కరోనా వైరస్ సోకిందని ఆరోపణలు చేస్తుండటం దారుణమని మోపిదేవి అన్నారు. ఇలాంటి ఆరోపణలు శోచనీయమని చెప్పారు. పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేసే ధరలకే తమకూ కరోనా కిట్లను సరఫరా చేయాలని సదరు కంపెనీకి ముందే స్పష్టం చేశామని... ఇప్పుడు దీనిపై విచారణ ఎందుకని ప్రశ్నించారు.