ఇండియాలో పెరిగిన కరోనా మరణాలు... గత 24 గంటల్లో బిగ్ జంప్!
- గత 24 గంటల్లో 62 మరణాలు
- 934కు చేరుకున్న మరణాల సంఖ్య
- 29,435కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య
మరోవైపు దేశంలో నమోదైన కరోనా మరణాల్లో 80 శాతం మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో చోటుచేసుకున్నాయి. మొత్తం 934 మరణాల్లో ఈ రాష్ట్రాల్లో మృతి చెందిన వారి సంఖ్య 741గా ఉంది. మొత్తం మరణాల్లో 39 శాతం మహారాష్ట్రలోనే సంభవించాయి.