50కి పైగా దేశాల్లో కరోనా బారిన పడిన భారతీయులు... 40 మంది మృత్యువాత
- విదేశీ గడ్డపై 6,300 మంది భారత పౌరులకు కరోనా పాజిటివ్
- గల్ఫ్ దేశాల్లో 2 వేల మందికి పైగా భారతీయులకు ఇన్ఫెక్షన్
- సింగపూర్ లో 90 శాతం భారతీయులు కరోనా బాధితులే!
సింగపూర్ లో ఉంటున్న 90 శాతం భారతీయులకు కరోనా సోకినట్టు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోనూ భారత పౌరులకు ఈ మహమ్మారి బెడద తప్పలేదు. కువైట్, బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈల్లో 2000కు పైగా మనవాళ్లు కరోనా ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. విదేశాల్లో ఉన్న వారు రావడంతోనే భారత్ లో కరోనా వ్యాప్తి మొదలైంది. ఈ కారణంగానే భారత ప్రభుత్వం విదేశాల్లో ఉన్నవారిని రావొద్దని, దేశంలో లాక్ డౌన్ విధించినందున ఎక్కడివారు అక్కడే ఉండాలని సూచించింది.