లాక్డౌన్ను మే 9 వరకు పొడిగించిన పాకిస్థాన్
- గత 24 గంటల్లో 642 కొత్త కేసులు
- ఇప్పటి వరకు 237 మంది మృతి
- రంజాన్ ప్రార్థనలకు షరతులతో కూడిన అనుమతి
ఈ మహమ్మారి బారి నుంచి 2,537 మంది కోలుకోగా, 237 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, దేశంలో నమోదవుతున్న కేసుల్లో 79 శాతం స్థానికంగా ఒకరి నుంచి ఒకరికి సోకడం ద్వారా వచ్చినవేనని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు, రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ప్రార్థనలు చేసుకునేందుకు ప్రభుత్వం కొన్ని షరతులతో అనుమతి ఇచ్చింది.