Gandhi Hospital: తమను అపార్టుమెంట్లలోకి అనుమతించడం లేదంటూ.. మహిళా డాక్టర్ల ఫిర్యాదు

  • గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా’ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న మహిళా డాక్టర్లు
  • డాక్టర్లను వారి నివాసంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్న ఇరుగుపొరుగు
  • డాక్టర్ల ఫిర్యాదుతో స్పందించిన మంత్రి ఈటల

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా’ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న మహిళా డాక్టర్లకు కొత్త ఇబ్బందులు వచ్చిపడ్డాయి. ‘కరోనా’ పేషెంట్లకు చికిత్స చేస్తున్నారన్న కారణంగా వైద్యులు నివాసం ఉండే అపార్టుమెంట్లలోకి వారిని అనుమతించడం లేదు. ఈ విషయమై వనస్థలిపురం పోలీసులకు మహిళా డాక్టర్లు ఫిర్యాదు చేశారు. కాగా, డాక్టర్ల ఇబ్బందులపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. డాక్టర్లను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News