కుంబ్లే ఎక్కువ కాలం కెప్టెన్ గా కొనసాగివుంటే ప్రతి రికార్డు బద్దలయ్యేది: గంభీర్
- కుంబ్లేని అత్యుత్తమ కెప్టెన్ గా పేర్కొన్న గంభీర్
- కుంబ్లే సారథ్యంలో 6 టెస్టులు ఆడినట్టు వెల్లడి
- 14 టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన కుంబ్లే
కెప్టెన్ గా ఎంఎస్ ధోనీ అనేక ఘనతలు సాధించినా, కుంబ్లేనే బెస్ట్ అని భావిస్తానని తెలిపాడు. సౌరవ్ గంగూలీ కూడా ఎన్నో విజయాలు అందుకున్నా, భారత్ కు సుదీర్ఘకాలం కెప్టెన్ గా వ్యవహరించదగ్గ వ్యక్తిగా కుంబ్లేనే కోరుకుంటానని వెల్లడించాడు. కుంబ్లే సారథ్యంలో తాను 6 టెస్టులు ఆడానని గంభీర్ తెలిపాడు.
లెగ్ స్పిన్నర్ గా ప్రపంచప్రఖ్యాతి గాంచిన కుంబ్లే 2007లో రాహుల్ ద్రావిడ్ నుంచి టీమిండియా పగ్గాలు అందుకున్నాడు. 14 టెస్టుల్లో భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించగా, భారత్ మూడు టెస్టుల్లో నెగ్గి, ఆరింట ఓడింది. మరో ఐదు మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి.