Mobile virology Lab: దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ హైదరాబాద్ లో ప్రారంభం

  • ఈఎస్ఐ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు
  • ఆన్ లైన్ ద్వారా ప్రారంభించిన మంత్రి రాజ్ నాథ్ సింగ్
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, కిషన్ రెడ్డి
Countrys first moobile virology in Hyderabad

దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈఎస్ఐ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ను కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కేంద్ర మార్గ దర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పారు. ‘కరోనా’ కట్టడికి త్రిముఖ వ్యూహం అనుసరిస్తున్నామని, ఎనిమిది ప్రత్యేక కొవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) గురించి ప్రస్తావించారు. కేవలం ఇరవై రోజుల్లోనే 1500 పడకలతో టిమ్స్ ను ఏర్పాటు చేశామని అన్నారు.

కాగా, ఐ క్లీన్, ఐ సేఫ్ సంస్థల సహకారంతో మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను డీఆర్డీవో తయారు చేసింది. ఈ ల్యాబ్ ‘కరోనా’ పరీక్షలతో పాటు వైరస్ కల్చర్, వ్యాక్సిన్ తయారీపై పనిచేస్తుంది.

More Telugu News