Corona Virus: దేశంలో 5,00,542 శాంపిళ్లను పరీక్షించాం.. 21,797 శాంపిళ్లు కరోనా పాజిటివ్‌గా తేలాయి: ఐసీఎంఆర్

  • దేశంలో పెరిగిపోతోన్న కరోనా కేసులు
  • 685 మంది మృతి
  • కోలుకున్న 4,348 మంది
coronavirus cases in india

దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతి రోజు వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశం మొత్తం మీద ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 4,85,172 మంది నుంచి 5,00,542 శాంపిళ్లు తీసుకుని పరీక్షించామని భారత వైద్య పరిశోధన మండలి ప్రకటన చేసింది. వారిలో ఇప్పటివరకు 21,797 శాంపిళ్లు పాజిటివ్‌గా తేలాయని ప్రకటించింది.

అయితే, దేశం మొత్తం మీద ఈ రోజు ఉదయం వరకు 21,359 కేసులు నమోదయ్యాయని అంతకుముందు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా 685 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి 4,348 మంది కోలుకున్నారని వివరించింది.

  • Loading...

More Telugu News