ఈ 12 లక్షణాల్లో ఏది కనిపించినా కరోనా పాజిటివ్ ఉండే అవకాశం ఉందట!
- విరేచనాలు, తలనొప్పి, వికారం కూడా లక్షణాలే
- కొందరిలో ఒకే లక్షణం కనిపించినా వైరస్ పాజిటివ్
- వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
డబ్ల్యూహెచ్ఓ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, మానవ శరీరంపై కరోనా వైరస్ కారణంగా 88 శాతం మందికి జ్వరం వస్తుంది. ఇక పొడిదగ్గు 68 శాతం మందిలో, అలసట 38 శాతం మందిలో, శ్లేష్మ దగ్గు 33 శాతం మందిలో కనిపిస్తాయి. వీటితో పాటు శ్వాస సమస్య 19 శాతం మందిలో, కండరాల నొప్పి 15 శాతం మందిలో, గొంతునొప్పి, తలనొప్పులు 14 శాతం మందిలో, చలిగా అనిపించడం 11 శాతం మందిలో ఉంటుంది. వికారం, ముక్కులో ఇబ్బంది 5 శాతం మందికి, విరేచనాలు 4 శాతం మందిలో కనిపించవచ్చని తెలిపింది.
కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో కొందరికి ఒక లక్షణమే బయటకు కనిపిస్తోందని, మరికొందరిలో మూడు, నాలుగు లక్షణాలు కనిపించాయని, అందుకని వీటిల్లో ఏ లక్షణం రోజుల తరబడి ఇబ్బంది పెడుతున్నా, కరోనా పరీక్షలు చేయిస్తేనే మంచిదని సిఫార్సు చేసింది.