వలస కార్మికుల అంశాన్ని కేంద్రం నిర్ణయానికే వదిలేసిన సుప్రీంకోర్టు
- వలస కార్మికులను ఆదుకోవాలంటూ సుప్రీంను ఆశ్రయించిన సామాజికవేత్తలు
- రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలంటే తాము కేంద్రాన్ని ఆదేశించలేమన్న సుప్రీం
- ఇలాంటి వ్యవహారాల్లో తాము నిపుణులం కాదంటూ స్పష్టీకరణ
"మేమేమన్నా ఇలాంటి వ్యవహారాల్లో ఆరితేరిన వాళ్లమా? అక్కడ రాష్ట్రాలలోను, కేంద్రంలోనూ పాలించడానికి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఉన్నాయి. నిధులు ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి... ఆర్థిక మద్దతు ఇవ్వండంటూ మేం ఎవరినీ ఆదేశించలేం" అంటూ జస్టిస్ ఎన్వీ రమణ, ఎస్కే కౌల్, బీఆర్ గవాయ్ లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.