Tamilnadu: తమిళనాడులో 27 మంది జర్నలిస్టులకు ‘కరోనా’ పాజిటివ్

27 Journalists have positive in Tamilnadu
  • ఓ ప్రముఖ ఛానెల్ లో పని చేస్తున్న జర్నలిస్టులకు పాజిటివ్
  • రిపోర్టర్లతో పాటు సబ్ ఎడిటర్లకు సోకిన వైరస్
  • క్వారంటైన్ కు తరలింపు.. చికిత్స

ముంబైలో 53 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. తాజాగా, తమిళనాడులో కూడా ఓ ప్రముఖ ఛానెల్ లో పని చేస్తున్న జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. రిపోర్టర్లతో పాటు సబ్ ఎడిటర్లు సహా మొత్తం 27 మందికి పాజిటివ్ గా తేలింది. అదే సంస్థలో పని చేస్తున్న ఓ జర్నలిస్ట్ కు తొలుత కరోనా పాజిటివ్ రావడంతో అక్కడే పని చేస్తున్న మొత్తం 94 మందికి కూడా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 26 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వీరిని క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News