Andhra Pradesh: ర్యాపిడ్ టెస్టు కిట్లు వినియోగించకుండానే రెండో స్థానంలో నిలిచిన ఏపీ

  • ప్రతి 10 లక్షల మందికి ఏపీలో 539 కరోనా టెస్టులు
  • 685 పరీక్షలతో రాజస్థాన్ అగ్రస్థానం
  • నిన్న ఒక్కరోజే ఏపీలో 5,400 కరోనా టెస్టులు
AP conducts more corona tests as it gets second place

ఏపీ ఇటీవల కరోనా కట్టడిలో భాగంగా దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ కిట్లను జిల్లాల వారీగా అందించి భారీగా కరోనా టెస్టులు చేయాలన్నది సర్కారు యోచన. అయితే, ఈ ర్యాపిడ్ కిట్లను వినియోగించకుండానే ఏపీ ప్రభుత్వం గణనీయమైన పురోగతి కనబరుస్తోంది. దేశం మొత్తమ్మీద అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయంలో రాజస్థాన్ మొదటిస్థానంలో ఉంది. ప్రతి 10 లక్షల మందికి రాజస్థాన్ లో 685 పరీక్షలు నిర్వహిస్తుంటే, ఏపీలో 539 పరీక్షలు చేపడుతున్నారు. నిన్న ఒక్కరోజే ఏపీలో 5,400 కరోనా టెస్టులు చేశారు. ఈ మేరకు వైసీపీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది.

More Telugu News