కరోనాకు వ్యాక్సిన్ ఒక్కటే శరణ్యం: ఐక్యరాజ్య సమితి
- వ్యాక్సిన్ వస్తేనే ప్రపంచం తిరిగి సాధారణ స్థితికి వస్తుందన్న సెక్రటరీ జనరల్
- శాస్త్రవేత్తలు ఈ ఏడాది చివరికల్లా అభివృద్ధి చేస్తారని ఆశాభావం
- అది సమర్థవంతంగా, సురక్షితంగా ఉండాలని సూచన
ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు 2 బిలియన్ డాలర్ల విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని, ఇప్పటికి 20 శాతం మేర సేకరించామని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి 47 ఆఫ్రికా దేశాల్లో ఐక్యరాజ్యసమితి కరోనా టెస్టులు చేస్తోందని చెప్పారు. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు పలు ఆఫ్రికా దేశాలు తీసుకున్న చర్యలను గుటెర్రస్ మెచ్చుకున్నారు.