ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించిన భారత్
- భారత్-పాక్ మధ్య జరగాల్సిన వామప్ సిరీస్ రద్దు
- ఇరు జట్లకు మూడేసి పాయింట్లు పంచిన ఐసీసీ
- 23 పాయింట్లు ఉన్న భారత్కు నేరుగా ప్రవేశం
ఐసీసీ మహిళల చాంపియన్షిప్లో భారత్కు 20, పాకిస్థాన్కు 16 పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు వామప్ సిరీస్ రద్దు కావడంతో ఇరు జట్లకు ఐసీసీ చెరో మూడు పాయింట్లు పంచింది. దీంతో భారత్ పాయింట్ల సంఖ్య 23కు పెరగ్గా, పాక్ పాయింట్లు 19కి పెరిగాయి. పాయింట్లలో భారత్ కంటే వెనకున్న పాక్ ప్రపంచకప్కు అర్హత సాధించలేకపోయింది.
మరోవైపు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్లు కూడా రద్దు కావడంతో ఆ జట్లకు కూడా ఐసీసీ సమాన పాయింట్లను పంచింది. ప్రపంచకప్కు అర్హత సాధించలేకపోయిన పాకిస్థాన్, శ్రీలంక మధ్య జులై 3-9 మధ్య సిరీస్ నిర్వహించనున్నట్టు ఐసీసీ తెలిపింది.