ఎబోలా చికిత్సకు వాడిన డ్రగ్తో కరోనాను నయం చేయొచ్చు: ఐసీఎంఆర్
- రెమ్ డెసివిర్ డ్రగ్ బాగా పని చేసే అవకాశం ఉంది
- ఇప్పటికే ముగ్గురిపై ప్రయోగించారని వెల్లడి
- భారత్లో ఎవరైనా డ్రగ్ తయారు చేస్తే వాడుతామన్న సంస్థ
దీనిపై ఐసీఎంఆర్ కు చెందిన మహమ్మారి, సంక్రమణ వ్యాధుల విభాగం అధిపతి రామన్ గంగాఖేడ్కర్ మాట్లాడుతూ.. ఎబోలా వైరస్ చికిత్స కు ఈ డ్రగ్ ను వాడినట్లు చెప్పారు. కరోనాకు చికిత్సలోనూ ఇది బాగా పని చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. అయితే అధ్యయనంలో చెప్పిన ప్రకారం ఇది క్లినికల్ ట్రయల్ కాదని, ఓ పరిశీలన మాత్రమేనని చెప్పారు. ముగ్గురిలో ఇద్దరికి ఈ డ్రగ్ వాడిన తర్వాత వాళ్లకు వెంటిలేటర్ అవసరం ఏర్పడలేదన్నారు. రెమ్ డెసివిర్ మెడిసిన్ ను గిలీడ్ సైన్సెస్ ఇంక్ కంపెనీ అభివృద్ధి చేసిందని, దేశంలో ప్రస్తుతం ఇది అందుబాటులో లేదన్నారు. మన దేశంలోని ఏదైనా ఫార్మా సంస్థ ఈ మెడిసిన్ ను తయారు చేస్తే చికిత్సకు వాడొచ్చని చెప్పింది.