English Medium: జగన్ ప్రభుత్వానికి షాక్.. 'ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి' జీవోలను కొట్టేసిన హైకోర్టు!

  • ఇంగ్లీష్ మీడియం జీవోలను సవాల్ చేస్తూ పిటిషన్లు
  • ఏ మీడియంలో చదువుకోవాలనేది విద్యార్థులు, తల్లిదండ్రులు నిర్ణయించుకుంటారని పిల్
  • జీవో 81, జీవో 85లను కొట్టేసిన హైకోర్టు
Another shock to Jagan government on english medium in High Court

ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరో షాక్ తగిలింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం విద్యను తప్పనిసరి చేస్తూ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 81, జీవో 85లను హైకోర్టు కొట్టి వేసింది. ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను సవాల్ చేస్తూ ఏలూరుకు చెందిన డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు...  ఈరోజు తీర్పును వెలువరించింది.

పిటిషనర్ తరఫు న్యాయవాది ఇంద్రనీల్ వాదిస్తూ... ఏ మీడియంలో చదువుకోవాలనే నిర్ణయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులే తీసుకుంటారని కోర్టుకు విన్నవించారు. ఇంగ్లీష్ మీడియం వల్ల బ్యాక్ లాగ్లు పెరిగిపోతాయని తెలిపారు. ఈ పిటిషన్లపై హైకోర్టు ఇటీవల వాదనలు విని, తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు తుది తీర్పును వెలువరిస్తూ... 81, 85 జీవోలను కొట్టివేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంను కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

More Telugu News