Prabhas: ప్రభాస్ సినిమా విషయంలో దర్శక నిర్మాతల నిర్ణయం?

  • రొమాంటిక్ మూవీ చేస్తున్న ప్రభాస్
  • తదుపరి సినిమా నాగ్ అశ్విన్ తో
  • ఫిబ్రవరి నుంచి షూటింగ్ చేయాలని నిర్ణయం
Nag Ashwin Movie will commence from February

ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగు ఆగిపోయింది. ఆ తరువాత ప్రభాస్ చేయనున్న నాగ్ అశ్విన్ సినిమా కూడా లాక్ డౌన్ కారణంగానే ఆలస్యమవుతోంది.

'మహానటి'తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఒక సినిమాను ప్లాన్ చేశాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్లాలని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా పనులన్నీ వాయిదా పడ్డాయి. అందువలన ఈ సినిమా రెగ్యులర్ షూటింగును వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలుపెట్టాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారని తెలుస్తోంది.

More Telugu News