కొవిడ్-19పై పోరాటానికి రూ.20 కోట్లు విరాళం ప్రకటించిన శాంసంగ్ ఇండియా
- రూ.15 కోట్లు పీఎం కేర్స్ ఫండ్ కు విరాళం
- మరో రూ.5 కోట్లు తమిళనాడు, యూపీ రాష్ట్రాలకు కేటాయింపు
- మంచి నిర్ణయం అంటూ శాంసంగ్ ను అభినందించిన ప్రధాని మోదీ
అంతేగాకుండా, తమ ఉద్యోగులు దేశవ్యాప్తంగా వ్యక్తిగతంగానూ విరాళాలు అందిస్తున్నారని తెలిపింది. మున్ముందు, తమ ఉద్యోగుల విరాళాల మొత్తానికి సమాన మొత్తాన్ని కలిపి పీఎం కేర్స్ ఫండ్ కు అందిస్తామని కూడా శాంసంగ్ ఇండియా పేర్కొంది. ఈ ప్రకటన పట్ల ప్రధాని మోదీ స్పందించారు. అగ్రగామి కంపెనీలు కూడా కరోనాపై పోరాటంలో కలిసి వస్తున్నాయని, శాంసంగ్ ఇండియా మంచి నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.