పీఎం కేర్స్ ఫండ్ కు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాన్ని తిరస్కరించిన సుప్రీం కోర్టు
- కరోనా నిధుల కోసం పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటు
- దీనిపై సుప్రీంను ఆశ్రయించిన న్యాయవాది ఎంఎల్ శర్మ
- పిటిషనర్ తప్పుగా అర్థం చేసుకున్నారన్న సుప్రీం కోర్టు
ఈ వ్యాజ్యాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఆధ్వర్యంలోని ధర్మాసనం... పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటును పిటిషనర్ తప్పుగా అర్థం చేసుకున్నారని భావిస్తూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. అంతేకాదు, ఈ ఫండ్ ను రాజ్యాంగంలోని 266, 267 ఆర్టికల్స్ ప్రకారం ఏర్పాటు చేయలేదన్న పిటిషనర్ అభిప్రాయాలను ధర్మాసనం అంగీకరించలేదు. కాగా, పీఎం కేర్స్ ఫండ్ కు ప్రధాని ఎక్స్ అఫిషియో చైర్మన్ గానూ, రక్షణ, హోం, ఆర్థిక మంత్రులు ఎక్స్ అఫిషియో ట్రస్టీలుగానూ వ్యవహరిస్తున్నారు.