ఈ సంవత్సరం ఐపీఎల్ రద్దు!
- మరింత కాలం కొనసాగనున్న లాక్ డౌన్
- కేంద్రం ప్రకటించగానే, ఐపీఎల్ రద్దుపై సమాచారం
- వెల్లడించిన బీసీసీఐ అధికారి
ఈ సంవత్సరం ఐపీఎల్ ను రద్దు చేయడం మినహా మరోదారి లేదని భావిస్తున్న బీసీసీఐ, వీలైతే, షెడ్యూల్ ను కుదించి, అక్టోబర్, నవంబర్ మధ్య కాలంలో, ఐసీసీ షెడ్యూల్ ను అనుసరించి, ఖాళీ దొరికితే నిర్వహించే అవకాశాలను తదుపరి పరిశీలిస్తామని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
కాగా, గత నెలలో ఐపీఎల్ పోటీలను ఏప్రిల్ 15 వరకూ వాయిదా వేస్తున్నట్టు గవర్నింగ్ బాడీ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ, 8 వేలను దాటడం, వైరస్ నియంత్రణ నిమిత్తం కఠిన చర్యలను కేంద్రం తీసుకోనున్న నేపథ్యంలో ఐపీఎల్ జరిగే అవకాశాలు లేవని బీసీసీఐ అధికారులు అంటున్నారు.