ముంబై తాజ్ మహల్ సిబ్బందిలో కరోనా పాజిటివ్... హోటల్ లో మొత్తం వైద్య సిబ్బందే ఉండటంతో కలకలం!
- ముంబైలోని కొలాబా ప్రాంతంలో హోటల్
- డాక్టర్లు, హెల్త్ వర్కర్ల బస
- ఆరుగురు ఉద్యోగులకు సోకిన వ్యాధి
ఇక, కొంతమంది తమ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ సోకిందని ఐహెచ్సీ స్పష్టం చేసింది. అయితే, ఎంతమందికి వైరస్ సోకిందన్న విషయాన్ని మాత్రం సంస్థ పేర్కొనలేదు. వీరికి కరోనా సోకినట్టు తేలినా, వ్యాధి లక్షణాలు మాత్రం కనిపించలేదని పేర్కొంది. కాగా, తాజ్ ప్యాలెస్ తో పాటు బాంద్రా ప్రాంతంలో తాజ్ లాండ్, కుఫ్పీ పరేడ్ ప్రాంతంలో వివాంతా ప్రెసిడెంట్, తాజ్ శాంతాక్రజ్ హోటళ్లను ఐహెచ్సీ నిర్వహిస్తోంది. కరోనా సోకిన తాజ్ హోటల్ ఉద్యోగులను బాంబే హాస్పిటల్ లో చికిత్స జరుగుతోందని, వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి కన్సల్టింగ్ ఫిజీషియన్ గౌతమ్ భన్సాలీ వెల్లడించారు.