Brahmanandam: సినీ కార్మికులకు హాస్యనటుడు బ్రహ్మానందం రూ.3 లక్షల విరాళం

  • కరోనా క్రైసిస్ చారిటీకి విరాళం ప్రకటించిన బ్రహ్మానందం
  • రోజు వారీ సినీ కార్మికులను ఆదుకునే నిమిత్తం విరాళం
  • సీసీసీకి పెరుగుతున్న విరాళాలు
Commedian Brahmanandam donation Rs 3 lakhs

లాక్ డౌన్ నేపథ్యంలో టాలీవుడ్ లో రోజు వారీ సినీ కార్మికులను ఆదుకునేందుకు నటీనటులు ఇస్తున్న విరాళాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. హీరో చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన వంతు విరాళం ప్రకటించారు. సినీ కార్మికులకు ఆసరాగా ఉండేందుకు రూ.3 లక్షల విరాళం ఇస్తున్నట్టు చారిటీకి తెలిపారు.

More Telugu News