లాక్ డౌన్ పొడిగింపుపై ప్రధాని మోదీ త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది: పవన్ కల్యాణ్
- జనసేన పీఏసీ సభ్యులతో పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్
- ప్రధాని సూచనలను బాధ్యతాయుతంగా అందరూ పాటించాలి
- కరోనా’ విపత్తుతో ఇబ్బంది పడుతున్న పేదలకు అండగా నిలుస్తాం
‘కరోనా’ సంక్షోభ సమయంలో రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నది తమ ఉద్దేశం కాదని, ఇబ్బందుల్లో ప్రజలకు అధికారుల నుంచి తగు సాయం, సేవలు అందేలా చూడాలని సూచించారు. లాక్ డౌన్ తర్వాత రాజకీయాల గురించి, పాలనలోని వైఫల్యాల గురించి మాట్లాడదామని అన్నారు.
స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ తరఫున నిలబడ్డ అభ్యర్థుల ద్వారా పేద కుటుంబాలకు వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ చేయించారని ఆరోపిస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యుులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి వాటిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని వారికి సూచించారు. అనంతరం, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, సభ్యుడు నాగబాబు మాట్లాడారు.