కరోనా భయంతో చేతులతో పాటు... కరెన్సీ నోట్లను కూడా సబ్బుతో కడిగేస్తున్నారు!
- నోట్లను సబ్బు నీటితో శుభ్రపరుస్తున్న కర్ణాటకలోని ఓ గ్రామ ప్రజలు
- పంట అమ్మగా వచ్చిన డబ్బును శుభ్రపరుస్తున్నామని వ్యాఖ్య
- భయంతోనే ఇలా చేస్తున్నారన్న అధికారులు
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, పంట అమ్మగా వచ్చిన డబ్బును ఈ విధంగా శుభ్రం చేస్తున్నామని చెప్పారు. దీని వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపారు. దీనిపై అధికారులు స్పందిస్తూ... భయంతోనే వారు ఇలా చేస్తున్నారని... ఇది ఆహ్వానించదగ్గ విషయం కాదని చెప్పారు. సబ్బుతో కడగడం వల్ల నోట్లు పాడవుతాయని తెలిపారు.