Corona Virus: ఒక్కడి ద్వారా 406 మందికి వైరస్... కరోనాపై ఐసీఎంఆర్ అధ్యయనం

ICMR study tells one person can spread corona to huge in thirty days without lock down
  • లాక్ డౌన్ నిబంధనలు పాటించని వ్యక్తితోనే ముప్పు
  • నిబంధనలు పాటిస్తే వ్యాధి సోకే రేటు తగ్గుతుందన్న ఐసీఎంఆర్
  •  లాక్ డౌన్ విధించడానికి కారణం ఇదేనన్న లవ్ అగర్వాల్

కరోనా వ్యాప్తి కట్టడి చేయడం ప్రభుత్వాలకు సవాల్ గా మారింది. ఓ వ్యక్తికి కరోనా సోకినప్పుడు ఆ వైరస్ తాలూకు లక్షణాలు బయటపడేసరికి 14 రోజుల సమయం పడుతుంది. ఈ లోపే ఆ వ్యక్తి మరికొందరికి వైరస్ అంటించే అవకాశాలు ఉండడంతో కరోనా వేగంగా విస్తరిస్తోంది. దీనిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ ఓ అధ్యయనం చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఈ అధ్యయనం గురించి మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఓ కరోనా పాజిటివ్ వ్యక్తి లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా సమాజంలో తిరిగినట్టయితే 30 రోజుల్లో 406 మందికి వ్యాధి సంక్రమింపచేయగలడని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. దీన్ని వైద్య పరిభాషలో 'ఆర్ నాట్' (R0) గా భావిస్తారు. అయితే, సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోగలిగితే ఆ వ్యక్తి ఇతరులకు వైరస్ అంటించే శాతాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు. నివారణ చర్యలు తీసుకుంటే అతడి ద్వారా వైరస్ బారినపడేవాళ్ల సంఖ్య సగటున కేవలం 2 నుంచి 2.5 వరకు ఉంటుందని తెలిపారు.

కరోనా రోగి సామాజిక సంచారాన్ని 75 శాతానికి పరిమితం చేయగలిగితే వ్యాధి సంక్రమణం కూడా అదే స్థాయిలో తగ్గిపోతుందని ఐసీఎంఆర్ అధ్యయనం చెబుతోంది. కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ విధించింది ఈ కారణంగానే అని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News