ఒక్కడి ద్వారా 406 మందికి వైరస్... కరోనాపై ఐసీఎంఆర్ అధ్యయనం
- లాక్ డౌన్ నిబంధనలు పాటించని వ్యక్తితోనే ముప్పు
- నిబంధనలు పాటిస్తే వ్యాధి సోకే రేటు తగ్గుతుందన్న ఐసీఎంఆర్
- లాక్ డౌన్ విధించడానికి కారణం ఇదేనన్న లవ్ అగర్వాల్
ఓ కరోనా పాజిటివ్ వ్యక్తి లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా సమాజంలో తిరిగినట్టయితే 30 రోజుల్లో 406 మందికి వ్యాధి సంక్రమింపచేయగలడని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. దీన్ని వైద్య పరిభాషలో 'ఆర్ నాట్' (R0) గా భావిస్తారు. అయితే, సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోగలిగితే ఆ వ్యక్తి ఇతరులకు వైరస్ అంటించే శాతాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు. నివారణ చర్యలు తీసుకుంటే అతడి ద్వారా వైరస్ బారినపడేవాళ్ల సంఖ్య సగటున కేవలం 2 నుంచి 2.5 వరకు ఉంటుందని తెలిపారు.
కరోనా రోగి సామాజిక సంచారాన్ని 75 శాతానికి పరిమితం చేయగలిగితే వ్యాధి సంక్రమణం కూడా అదే స్థాయిలో తగ్గిపోతుందని ఐసీఎంఆర్ అధ్యయనం చెబుతోంది. కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ విధించింది ఈ కారణంగానే అని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు.