West Bengal: క్వారంటైన్ సెంటర్ విషయంలో గొడవ.. ఒకరు మృతి

One person dead in attacks over quaratine centre establishment
షార్ట్స్‌లో చూడండి
కరోనా మహమ్మారి బాధితుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పశ్చమబెంగాల్ లోని బిర్బ్ హమ్ జిల్లా పరుయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలిబ్ పూర్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్లే, గ్రామంలోని పాఠశాలలో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. అయితే గ్రామంలోని ఓ వర్గానికి చెందిన ప్రజలు దీన్ని వ్యతిరేకించగా... మరో వర్గం సమర్థించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరగింది. ఇది ముదిరి... కత్తులు, బాంబులతో ఒకరిపై మరొకరు దాడికి తెగబడేంత వరకు వెళ్లింది. ఈ ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలయ్యాయి.

గొడవ గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
West Bengal
Corona Virus
Quarantine Centre

More Telugu News