ఓసారి న్యూయార్క్ లో పరిస్థితి ఎలావుందో చూడండి: ప్రజలను హెచ్చరించిన పాక్ ప్రధాని
- కరోనాకు ఎవరూ అతీతులు కారన్న ఇమ్రాన్ ఖాన్
- దీన్నో సవాల్ గా స్వీకరించాలని ఉద్బోధ
- జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర నష్టం తప్పదని వ్యాఖ్యలు
"కరోనా వైరస్ మనల్నేమీ చేయదులే అనుకుంటే అది వాళ్ల భ్రమ. న్యూయార్క్ లో ఎంతో ధనికులైన ప్రజలు నివసిస్తుంటారు. ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటో చూడండి. ఒక్కసారి ఈ వైరస్ తిష్టవేసిందంటే ఏం జరుగుతుందో మనం ఊహించలేం" అని స్పష్టం చేశారు. దేశంలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దీన్నో సవాల్ గా స్వీకరిస్తే పాకిస్థాన్ ఒక భిన్నమైన దేశంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు పాకిస్థాన్ లో 2,880 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 45 మంది మృత్యువాత పడ్డారు.